సత్యం లాంటి కుంభకోణానికి పాల్పడ్డ మార్గదర్శి : ఏపీ సీఐడీ

Margadarsi Chit Fund Scam 9 branches in AP set for closure Rs 604 crore up for distribution. ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2023 3:15 PM GMT
సత్యం లాంటి కుంభకోణానికి పాల్పడ్డ మార్గదర్శి : ఏపీ సీఐడీ

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ (MCFPL) కి చెందిన మొత్తం తొమ్మిది శాఖలలో అవకతవకలు జరిగాయని గుర్తించింది. ఈ ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత వాటిని మూసివేయనున్నారు. చిట్ ఫండ్ ద్వారా మోసానికి గురైన బాధితులకు రూ.604 కోట్ల నిధులను పంపిణీ చేయాల్సి ఉందని, నిబంధనలను ఉల్లంఘించిన చిట్ గ్రూపుల మూసివేత ప్రక్రియను ప్రారంభించినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంసీఎఫ్‌పీఎల్‌కు చెందిన రూ.1,035 కోట్ల విలువైన చరాస్తులను సీఐడీ అటాచ్ చేసిన తర్వాత, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీఐడీ ఎన్ సంజయ్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. “MCPFL ఆంధ్రప్రదేశ్‌లో 37 శాఖలను కలిగి ఉందని.. 23 గ్రూపులతో కూడిన తొమ్మిది శాఖలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామన్నారు. మోసానికి పాల్పడ్డ శాఖలను మూసివేసి, డబ్బును చందాదారులకు తిరిగి ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేయబడతాయి,” అని సంజయ్ చెప్పారు.

MCFPL ను హైదరాబాద్‌లో ఆగస్టు 31, 1962న స్థాపించారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం శాఖల సంఖ్య 37 కాగా 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి 1.04 లక్షల మంది చందాదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వార్షిక టర్నోవర్ రూ. 9,677 కోట్లుగా ఉంది.

ఏపీలోనే అతిపెద్ద చిట్‍ఫండ్ స్కాంను నిరోధించే ప్రయత్నం చేస్తున్నట్లు ఏపీ సిఐడి సంజయ్ తెలిపారు. 1982 చిట్‍ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి సంస్థకు ఉందని మార్గదర్శి చిట్‍ఫండ్ నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడంతో సహా పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బు తరలిస్తున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. "అమాయక చందాదారులను దోపిడీ చేయడం ద్వారా చిట్ ఫండ్ కార్యకలాపాల పేరుతో ఇప్పటివరకు చూడని అతిపెద్ద ఆర్థిక మోసాలను నిరోధించే ప్రక్రియలో మేము ఉన్నాము. చట్టవిరుద్ధంగా డిపాజిట్లను స్వీకరించిన చరిత్ర కలిగిన మార్గదర్శి చిట్ గ్రూప్, చిట్ ఫండ్ చట్టం 1982ని ఉల్లంఘించి, చందాదారుల నుండి ప్రయోజనాలను పొందుతోంది” అని సంజయ్ అన్నారు. ప్రజలకు ఎక్కువ వడ్డీ ఇస్తామనే ఆశ చూపి చందాదారుల డబ్బును మార్గదర్శి తనవద్దే ఉంచుకుంటోందని ఏపీ సిఐడి ఆరోపించింది. చిట్‍ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఖాతాలను నిర్వహించడంతో పాటు, బ్యాలెన్స్ షీట్ దాఖలు చేయట్లేదని సంజయ్ తెలిపారు. మార్గదర్శి చిట్‍ఫండ్స్‍పై ఇప్పటి వరకు 7 FIRలు నమోదు చేశామని తెలిపారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌లన్నింటిలో, రామోజీ రావు ( A1) గా.. కంపెనీ చైర్మన్ (MCFPL) శైలజా కిరణ్ A2 గా, బ్రాంచ్ మేనేజర్‌లు A3 లుగా, MCFPL కంపెనీ A4గా, ప్రిన్సిపల్ ఆడిటర్ కె శ్రవణ్ A5 గా ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు నిందితులను విచారించినా, దర్యాప్తుకు సహకరించట్లేదన్నారు.

మార్గదర్శి కంపెనీ చట్టం ప్రకారం బ్యాలెన్స్ షీట్లను దాఖలు చేయలేదు:

CID దర్యాప్తులో, చిట్ ఫండ్ చట్టం, 1982 ప్రకారం మార్గదర్శి గ్రూప్ బ్యాలెన్స్ షీట్ లను దాఖలు చేయలేదు. ఎన్నో అవకతవకలు గుర్తించామని అన్నారు. “దీనిపై ప్రశ్నించగా.. నిందితులలో ఒకరైన శైలజా కిరణ్, తాము కంపెనీ చట్టం ప్రకారం బ్యాలెన్స్ షీట్లను అప్‌డేట్ చేశామని, కానీ చిట్ ఫండ్స్ చట్టంలో లేమని పేర్కొన్నారు. ఈ విధంగా, ఇంటర్-గ్రూప్ బదిలీలు కనుగొనబడవు, ఇది తీవ్రమైన ఆర్థిక నేరాలలో ఒకటి, ”అని సంజయ్ అన్నారు.

మార్గదర్శి గ్రూప్ చేసిన ఉల్లంఘనలు:

- రహస్యంగా వారి అసోసియేట్ కంపెనీలకు, ఇతర తెలియని పెట్టుబడులకు నిధుల మళ్లింపు.

- అమలులో ఉన్న వివిధ చట్టాలను ఉల్లంఘిస్తూ అధిక మొత్తంలో నగదు చందాలను స్వీకరించడం ద్వారా డబ్బును లాండరింగ్ చేయడం.

- చట్టవిరుద్ధంగా డిపాజిట్లను స్వీకరించడం. వడ్డీ అధికంగా ఇస్తామని చెబుతూ చందాదారుల డబ్బును కంపెనీ వద్దనే ఉంచేలా ఒత్తిడి చేయడం.

- మోసపూరిత అకౌంటింగ్ పద్ధతుల ద్వారా మార్గదర్శి గ్రూప్ ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

- బ్రాంచ్ స్థాయిలో చేతికి చెక్కులు ఇచ్చి నగదు నిల్వలను పెంచడం.

- నివేదించబడిన గణాంకాల వాస్తవికతను తెలుసుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించకపోవడం.

“విచారణ సమయంలో, మనీలాండరింగ్, నిధులను స్వాహా చేయడం, కార్పొరేట్ మోసాలు, బినామీ లావాదేవీలు ఉన్నాయి. ఆదాయపు పన్ను ఎగవేత వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను మేము కనుగొన్నాము. ఈ ఉల్లంఘనలు సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల డొమైన్‌కు సంబంధించినవి కాబట్టి, మేము ఢిల్లీ, హైదరాబాద్‌లోని సంబంధిత ఏజెన్సీలను కలుసుకున్నాము. కంపెనీపై సకాలంలో చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాము, ”అని సంజయ్ చెప్పారు.

మార్గదర్శి గ్రూప్ చందాదారులకు 4-5% వార్షిక వడ్డీ రేటును అందించడం ద్వారా భవిష్యత్తులో సభ్యత్వాలకు వ్యతిరేకంగా రసీదులను ఇచ్చి.. అక్రమంగా డిపాజిట్లను తీసుకుంటున్నట్లు కనుగొనబడింది.

చందాదారుల విషయంలో కూడా :

ఒక గ్రూపు నుంచి వచ్చిన చిట్ ఫండ్ సొమ్మును మరో గ్రూపునకు మళ్లించినట్లు విచారణలో తేలింది. మొత్తం నిధులు ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌కు బదిలీ చేశారు. అధికారుల ప్రకారం, చందాదారులను ఎప్పుడూ చట్టబద్ధంగా గుర్తించలేదు, ఇది తప్పనిసరి. వారు ఎప్పుడూ నిబంధనలను పాటించలేదు. “ఓ గ్రూప్ నుండి నిష్క్రమించిన చందాదారుల పేర్లు మరొక చిట్-గ్రూప్‌కు జోడించబడినట్లు మేము కనుగొన్నాము. వేలాది మంది ఖాతాలో లేని చందాదారులు ఉన్నారు. తొలగించబడిన చందాదారుల పేర్లను తిరిగి నమోదు చేస్తున్నారు, ”అని సంజయ్ తెలిపారు. కొత్త చిట్ వ్యాపారాన్ని నిలిపివేయాలని తాము ఆదేశాలు జారీ చేయలేదని, అయితే చిట్ ఫండ్ చట్టం, 1982 ప్రకారం బ్యాలెన్స్ షీట్ దాఖలు చేయాలని, నిబంధనలను అనుసరించాలని కోరామని క్లారిటీ ఇచ్చారు.

సత్యం కుంభకోణం లాంటిదే

మార్గదర్శి అనుసరించిన ఉల్లంఘనలు, మోసపూరిత పద్ధతులు సత్యం కంప్యూటర్స్, సహారా, శారదా చిట్స్ మోసంతో సారూప్యతను కలిగి ఉన్నాయని సంజయ్ చెప్పుకొచ్చారు. మార్గదర్శి గ్రూప్ చేస్తున్న ఈ దోపిడీని అరికట్టడానికి మార్గదర్శి ఖాతా పుస్తకాలపై లోతైన విచారణ తప్పనిసరి. ఈ దిశగా దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి పరిణామాలను తగిన సమయంలో తెలియజేస్తామని ఆయన తెలిపారు.

తప్పుడు ఆరోపణలు

లేవనెత్తిన తప్పుడు ఆరోపణలపై సంజయ్ మాట్లాడుతూ.. నిందితులు దర్యాప్తు ప్రక్రియలో సహకరించడానికి బదులుగా, వివిధ వేదికలపై, వివిధ మార్గాల్లో CID పరువు తీయడంలోనూ, నిందలు వేయడంలోనూ మునిగిపోయారని సంజయ్ అన్నారు.


Next Story