కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు..ప్రకటించిన విమానయాన సంస్థ
IndiGo to start flights between Kurnool and three cities from March 28. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు
By Medi Samrat Published on
30 Jan 2021 2:30 AM GMT

కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ శుక్రవారం ప్రకటించింది. రీజినల్ కనెక్టివిటీ పథకం (ఉడాన్)లో భాగంగా మార్చి 28 నుంచి ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో రీజినల్ కనెక్టివిటీని పెంచేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్కు అనుమతి లభించిన నేపథ్యంలో రీజినల్ కనెక్టివిటీ అవసరమని భావిస్తున్నామని ఇండిగో ప్రధాన స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్కుమార్ తెలిపారు. కొత్తగా ప్రారంభించే బెంగళూరు-కర్నూలు, విశాఖ-, కర్నూలు, చెన్నై-కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయని పేర్కొంది. ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి రీజినల్ కనెక్టివిటీ కోసం ఉడాన్ పథకం ప్రారంభించారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు కేంద్రం 2017లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
Next Story