ఏపీలో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదిక నుంచి ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు.
By - Medi Samrat |
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదిక నుంచి ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు. రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
వాటి వివరాలు..
రూ. 9,449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ.
రూ. 1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాన మంత్రి.
రూ. 2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని.
శంకుస్థాపనలు:
విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ - రూ. 2886 కోట్లు
ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ - రూ. 4922 కోట్లు
కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు
పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ - రూ. 184 కోట్లు
సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు
ప్రారంభోత్సవాలు:
రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు
కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు
కనిగిరి బైపాస్ రోడ్ - రూ. 70 కోట్లు
గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు
కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు – రూ. 13 కోట్లు
పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్ - రూ. 593 కోట్లు
నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు
చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ – రూ. 200 కోట్లు
జాతికి అంకితం:
కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు– రూ. 546 కోట్లు
శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్లైన్ - రూ. 1730 కోట్లు.