ఏపీ నుండి రూ.495 కోట్లు తిరిగి ఇప్పించండి: మంత్రి హరీశ్‌ రావు

Harish Rao Letter to Union Minister Nirmala Sitaraman. ఆంధ్రప్రదేశ్‌కు బలయించిన సెంటర్లీ స్పాన్సర్డ్‌ స్కీం (సీఎస్‌ఎస్‌) రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని

By Medi Samrat  Published on  22 Jan 2023 3:15 PM GMT
ఏపీ నుండి రూ.495 కోట్లు తిరిగి ఇప్పించండి: మంత్రి హరీశ్‌ రావు

ఆంధ్రప్రదేశ్‌కు బలయించిన సెంటర్లీ స్పాన్సర్డ్‌ స్కీం (సీఎస్‌ఎస్‌) రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. 2014-15లో సీఎస్‌ఎస్‌ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నగదును పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హరీశ్ రావు లేఖ రేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, పొరపాటున మొత్తం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని.. అందువల్ల తెలంగాణ నష్ట పోయిందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని అన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు.


Next Story