నేనూ నా పని తీరును ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది..మంత్రులకు ర్యాంకులపై చంద్రబాబు రియాక్షన్

వేగవంతమైన పని తీరుతో సత్వర ఫలితాలు సాదిద్ధామని ఏపీ మంత్రులకు రాష్ట్ర సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

By Knakam Karthik  Published on  7 Feb 2025 2:45 PM IST
Andrapradesh, Cm Chandrababu, Ap Ministers, Tdp, Janasena, Bjp

నేనూ నా పని తీరును ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది..మంత్రులకు ర్యాంకులపై చంద్రబాబు రియాక్షన్

వేగవంతమైన పని తీరుతో సత్వర ఫలితాలు సాదిద్ధామని ఏపీ మంత్రులకు రాష్ట్ర సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే... మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం అని రాసుకొచ్చారు.

కాగా ఏపీ మంత్రుల పనితీరు ఆధారంగా నిన్న సీఎం చంద్రబాబు ర్యాంకింగ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తాను కూడా మెరుగుపడాల్సి ఉందని నిజాయతీగా అంగీకరించారు. ఈ ర్యాంకులు విడుదల చేసింది ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అనే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప... విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం.

ఫైళ్ల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు... ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. పీపుల్ ఫస్ట్ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను" అని చంద్రబాబు వివరించారు.

Next Story