రేపు సీఎం చంద్ర‌బాబు మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్ల‌నున్నారు

By Medi Samrat  Published on  10 July 2024 9:00 AM GMT
రేపు సీఎం చంద్ర‌బాబు మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

ఉదయం

• 10.00 గంటలకు ఉండవల్లి నివాసం నుండి పర్యటనకు బయలుదేరుతారు.

• 11.20-11.50 : వరకు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం

• 12.35-01.30 : వరకు భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శిస్తారు. అనంతరం ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు

• 02.30-04.30 : వరకు వర్చువల్ గా సీఐఐ కాన్ఫరెన్సులో పాల్గొంటారు. అనంతరం మెడ్ టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు

సాయంత్రం

• 04.50-06.00 : విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు.

• 07.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story