ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల షెడ్యూల్ ఇలా ఉంది. సీఎం చంద్రబాబు ఐదవ తేదీ ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ నగరం, పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి వెళతారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళతారు. గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లి 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో ఓ శుభకార్యానికి హాజరవ్వడంతో పాటు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ వెళతారు.
6వ తేదీ ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు అవుతారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. 5.30 గంటలకు భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో పాల్గొంటారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు.