రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను.. పలనాడు గ‌డ్డ‌పై నుంచి సీఎం హెచ్చ‌రిక‌లు

మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

By -  Medi Samrat
Published on : 20 Sept 2025 2:36 PM IST

రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను.. పలనాడు గ‌డ్డ‌పై నుంచి సీఎం హెచ్చ‌రిక‌లు

మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పలనాడు-మాచర్లలో జ‌రిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగితే.. మాచర్లలో రౌడీలు విధ్వంసం సృష్టించారు.. మొన్నటి వరకూ ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు లేవు. కొందరు డిక్టేటర్లు ఉన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరు. మాచర్ల వద్దామంటే నా ఇంటికి తాళ్లు కట్టి రానీయకుండా చేశారు. నా ఇంటికి తాళ్లు కట్టి వారి మెడలకు ఉరితాళ్లు వేసుకున్నారు. గతంలో ఇక్కడ చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. రౌడీయిజం చేసినా.. విధ్వంసం చేసినా చూస్తూ ఊరుకోను. నేరాలు వద్దు.. ఘోరాలు చేయొద్దు అన్నారు. మన పరిసరాల్లోని చెత్తే కాదు.. రాజకీయ చెత్తను కూడా తొలగించాల్సి ఉందన్నారు. గత పాలకులు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అలాగే ఉంచేశారు. చెత్తపై పన్నేశారు.. ఆ చెత్తను తొలగించటంతో పాటు చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానన్నారు.

Next Story