గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను

వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారాలపై ప్రజావేదిక సభలో స్పందిస్తూ.. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదు. వారి జీవితమే ఫేక్ అంటూ మండిప‌డ్డారు.

By -  Medi Samrat
Published on : 1 Nov 2025 6:14 PM IST

గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను

వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారాలపై ప్రజావేదిక సభలో స్పందిస్తూ.. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదు. వారి జీవితమే ఫేక్ అంటూ మండిప‌డ్డారు. వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి నాపై నెట్టేశారు. సీఎంగా నన్నూ మోసం చేశారు. సాక్షిలో గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను.. నేనెప్పుడూ రాగద్వేషాలతో పనిచేయనన్నారు. ఓ సర్కిల్ ఇనస్పెక్టర్‌ను దగ్గర పెట్టుకుని రక్తం పడిన గదిని కడిగేశారు.. ఆధారాలు చెరిపేశారు.. వివేకా కుమార్తె ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు గొడ్డలి పోటని ప్లేటు ఫిరాయించారు. అలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా..? అసలు వారికి పార్టీగా ఉండే అర్హత ఉందా..? అని ప్ర‌శ్నించారు.

ప్రజల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని అనుకుంటే ఎంతటి వారినైనా ఢీ కొంటాన‌న్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ ను, హైదరాబాద్‌లో మత విద్వేషాలు, నక్సల్స్ సమస్యనూ అణచివేశాం.. అందుకే అలిపిరిలో నాపై క్లైమోర్ మైన్స్ పేల్చారు.. నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో నేరాలు చేస్తూ.. ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.. కర్నూలులో బస్సు దగ్ధం ఘటన జరిగితే అందులోనూ ఫేక్ ప్రచారాలకు తెరతీశారని మండిప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఒడిశాలో బస్సు రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్ నుంచి బెంగుళూరు మధ్య నడుపుతున్నారు. ఏపీలో ప్రమాదం జరిగితే దానిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వ్యక్తులు దుష్ర్ప‌చారం చేస్తుంటే ప్రతీ రోజూ చెప్పుకోవాలా..? వైసీపీకి ఓ పాంప్లెట్ ఉంది. ఓ ఛానల్ కూడా ఉంది. కానీ ఆ వ్యక్తులు బయటకు వచ్చి మాకు ఛానల్ లేదు, పేపర్ లేదని ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

వాహానాల రిజిస్ట్రేషన్ల అంశంపైనా కేంద్రానికి కూడా ఓ లేఖ రాస్తానన్నారు. పేపర్, ఛానల్ ద్వారా శవరాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మరో ఘటనలో కమ్మ కాపు మధ్య కుల విద్వేషాలు రగిల్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లు నిద్రలేస్తే చాలు దుష్ప్రచారానికి తెగబడుతూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.. బురద వేస్తారని అన్నారు. వివేకా హత్య ఘటనలో ఏమరుపాటుకు గురయ్యాం. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారు.. ఇక ఏమాత్రం ఉపేక్షించను. అడుగడుగునా సీసీ కెమెరాలు, ఆధారాలు ఉన్నాయి. అన్నిటినీ బయటపెడతామ‌న్నారు. అమాయకులను మోసం చేస్తూ కులం, మతం, ప్రాంతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

Next Story