నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాల‌కు పరిహారం ప్ర‌క‌టించిన సీఎం

నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది.

By -  Medi Samrat
Published on : 18 Sept 2025 2:48 PM IST

నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాల‌కు పరిహారం ప్ర‌క‌టించిన సీఎం

నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.35 లక్షలు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

బుధ‌వారం నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్‌-కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్ర‌యాణిస్తున్న‌ చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టింది. కారు టిప్పర్‌ కిందకు దూసుకెళ్లడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Next Story