తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదు : జీవీఎల్

BJP MP GVL Narsimha Rao Comments On BRS. తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు అన్నారు.

By Medi Samrat  Published on  3 Jan 2023 8:27 AM GMT
తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదు : జీవీఎల్

తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు అన్నారు. తెలంగాణ ప్రజలే బీఆర్‌ఎస్‌ను ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు సమర్ధించాలి..? అని జీవీఎల్‌ ప్ర‌శ్నించారు. ఏపీ ప్రజలను తిట్టినందుకు కేసీఆర్‌ను సమర్ధించాలా..? ఆంధ్రా వాళ్లను తరిమి తరిమి కొడతామన్నందుకు సమర్ధించాలా..? అని ప్ర‌శ్న‌లు సంధించారు. కోవిడ్ సమయంలో ఏపీ ప్రజలు వైద్యం కోసం వస్తే బోర్డర్‌లొ అడ్డుకున్నార‌ని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఆంధ్రాకు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని సుప్రీంను ఎందుకు ఆశ్రయించారు..? అని ప్ర‌శ్నించారు. ఏపీని ఎడారిలా మార్చాలనుకున్న కేసీఆర్‌...ఏపీలో ఎలా రాజకీయం చేస్తారు..? అని అడిగారు. ఏపీకి రావాల్సిన నిధులను ఇంత వరకు రాకుండా చేశార‌ని.. ఆంధ్రా ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని అన్నారు.


Next Story