ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది.42 అజెండా అంశాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో మాట్లాడుతూ పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన దీనిపై తెలంగాణకు ఎటువంటి నష్టమూ లేదని స్పష్టం చేశారు.
పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అభ్యంతరం చెప్పలేదు అన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలు అంతా మాట్లాడాలన్నారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందని..సీఎం చంద్రబాబు సూచించారు.