రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది.

By Knakam Karthik
Published on : 3 Sept 2025 4:30 PM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, Ap Cabinet

రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా రాజధానిలో పలు ప్రాజెక్టులకు ఎస్‌పీవీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ నోటిఫికేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించి భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది.

కాగా రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని వాటిపై భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అటు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టమ్‌కు అనుమతి కోసం కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Next Story