తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో 99 క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 4:50 PM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో 99 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 99 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా.. 4 గురు మృతి చెందార‌ని తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2891 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 92 మంది మృతి చెందారు. ఈ రోజు న‌మోదైన కేసుల‌లో వేరే ప్రాంతాల నుండి వ‌చ్చిన వల‌స కార్మికుల‌లో 12మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

ఈ రోజు న‌మోదైన కేసుల‌లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 70 కేసులు న‌మోదు కాగా.. రంగారెడ్డిలో 7, మ‌హ‌బూబాబాద్ 1, జ‌గిత్యాల్ 1, న‌ల్ల‌గొండ 2, సంగారెడ్డి 2, మంచిర్యాల్ 1, సిద్దిపేట 1 చొప్పున కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వర‌‌కు 1526 డిశ్చార్జి కాగా.. 1273 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలావుంటే తెలంగాణ‌లో మొదట్లో కేసుల సంఖ్య తగ్గుముఖం ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలువుతుంది. అయినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది.

02

Next Story