ఏపీలో 3 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 11:27 AM GMT
ఏపీలో 3 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువ‌య్యాయి. గడిచిన 24గంటల్లో 56,090 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,652 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో ప‌ద్నాలుగు మంది, ప్ర‌కాశంలో ప‌ద‌కొండు మంది, అనంత‌పూర్‌లో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిదిమంది, క‌ర్నూలులో తొమ్మిది మంది, నెల్లూరులో ఏడుగురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఐదుగురు, విజ‌య‌న‌గ‌రంలో ఐదుగురు, తూర్పుగోదావ‌రిలో న‌లుగురు, కృష్ణాలో ముగ్గురు, క‌డ‌ప‌లో ఒక్క‌రు చొప్పున మొత్తం 88మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2,820కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,18,311 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 85,130 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 445,

చిత్తూరులో 990,

ఈస్ట్‌ గోదావరిలో 1396,

గుంటూరులో 895,

కడపలో 755,

కృష్ణలో 281,

కర్నూలులో 830,

నెల్లూరులో 684,

ప్రకాశంలో 725,

శ్రీకాకుంలో 405,

విశాఖపట్నంలో 928,

విజయనగరంలో 513,

పశ్చిమ గోదావరిలో 805 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story