ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 8,943 కేసులు.. 97 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 12:42 PM GMT
ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 8,943 కేసులు.. 97 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 53,026 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,943 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,085కి చేరింది.

కొవిడ్‌ వల్ల క‌ర్నూలులో ప‌న్నెండు మంది, చిత్తూరులో పది మంది, తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌దిమంది, గుంటూరులో ప‌దిమంది, ప‌శ్చిమ‌గోదావరిలో ప‌దిమంది, నెల్లూరులో ప‌దిమంది, అనంత‌పురంలో ఆరుగురు, క‌డ‌ప‌లో ఆరుగురు, ప్ర‌కాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఆరుగురు, విజ‌య‌న‌గ‌రంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్ద‌రు చొప్పున మొత్తం 97మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2,475 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,80,703 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 89,907 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 762,

చిత్తూరులో 987,

ఈస్ట్‌ గోదావరిలో 1146,

గుంటూరులో 527,

కడపలో 530,

కృష్ణలో 338,

కర్నూలులో 956,

నెల్లూరులో 669,

ప్రకాశంలో 300,

శ్రీకాకుంలో 547,

విశాఖపట్నంలో 885,

విజయనగరంలో 548,

పశ్చిమ గోదావరిలో 748 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story