ఏపీలో కొత్త‌గా 6,555 కేసులు.. 31 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2020 1:16 PM GMT
ఏపీలో కొత్త‌గా 6,555 కేసులు.. 31 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 70,399 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,555 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,06,790కి చేరింది.

కొవిడ్‌ వల్ల కృష్ణలో ఆరుగురు, అనంతపూర్‌లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, క‌ర్నూల్‌లో ముగ్గురు, విశాఖ‌ప‌ట్నంలో ముగ్గురు, గుంటూరులో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఇద్ద‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఇద్ద‌రు, క‌డ‌ప‌లో ఒక్క‌రు, శ్రీకాకులంలో ఒక్క‌రు చొప్పున 31 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,900కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,43,993 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 56,897 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 333,

చిత్తూరులో 925,

ఈస్ట్‌ గోదావరిలో 975,

గుంటూరులో 451,

కడపలో 339,

కృష్ణలో 473,

కర్నూలులో 204,

నెల్లూరులో 486,

ప్రకాశంలో 668,

శ్రీకాకుంలో 223,

విశాఖపట్నంలో 297,

విజయనగరంలో 251,

పశ్చిమ గోదావరి 930 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story