ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Sep 2020 12:03 PM GMT
ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 56,569 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,235 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,31,749కి చేరింది.

కొవిడ్‌ వల్ల కృష్ణలో తొమ్మిది మంది, చిత్తూరులో ఏడుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఆరుగురు, అనంత‌పురంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో న‌లుగురు, పశ్చిమగోదావరిలో న‌లుగురు, క‌ర్నూలులో ముగ్గురు, క‌డ‌ప‌లో ఇద్దరు, ప్ర‌కాశంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్క‌రు చొప్పున మొత్తం 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,410కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,51,821 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 74,518 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 505,

చిత్తూరులో 362,

ఈస్ట్‌ గోదావరిలో 1262,

గుంటూరులో 532,

కడపలో 219,

కృష్ణలో 133,

కర్నూలులో 190,

నెల్లూరులో 401,

ప్రకాశంలో 841,

శ్రీకాకుంలో 283,

విశాఖపట్నంలో 150,

విజయనగరంలో 395,

పశ్చిమ గోదావరి 962 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story