ఏపీలో కొత్తగా 6,190 కేసులు.. 35 మరణాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Sept 2020 7:28 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 68,429 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,190 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,87,351కి చేరింది.
కొవిడ్ వల్ల ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, అనంతపూర్లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, శ్రీకాకుథంలో ఇద్దరు చొప్పున 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,780కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,22,136 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 59,435 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 276,
చిత్తూరులో 784,
ఈస్ట్ గోదావరిలో 991,
గుంటూరులో 410,
కడపలో 299,
కృష్ణలో 398,
కర్నూలులో 144,
నెల్లూరులో 432,
ప్రకాశంలో 569,
శ్రీకాకుంలో 377,
విశాఖపట్నంలో 291,
విజయనగరంలో 312,
పశ్చిమ గోదావరి 907 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.