ఏపీలో కొత్త‌గా 5,653 కేసులు.. 35 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2020 1:00 PM GMT
ఏపీలో కొత్త‌గా 5,653 కేసులు.. 35 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 73,625 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,653 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,50,517కి చేరింది.

కొవిడ్‌ వల్ల ప్ర‌కాశంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు‌గోదావ‌రిలో న‌లుగురు, కృష్ణ‌లో న‌లుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖ‌ప‌ట్నంలో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, గుంటూరులో ఇద్ద‌రు, క‌ర్నూల్‌లో ఇద్ద‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఇద్ద‌రు, క‌డ‌ప‌లో ఒక్క‌రు, శ్రీకాకుళంలో ఒక్క‌రు చొప్పున 35 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 6,194కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,97,699 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 46,624 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 351,

చిత్తూరులో 706,

ఈస్ట్‌ గోదావరిలో 706,

గుంటూరులో 470,

కడపలో 504,

కృష్ణలో 468,

కర్నూలులో 119,

నెల్లూరులో 322,

ప్రకాశంలో 538,

శ్రీకాకుళంలో 163,

విశాఖపట్నంలో 289,

విజయనగరంలో 194,

పశ్చిమ గోదావరి 823 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story