తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  10 Oct 2020 4:26 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,811 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,10,346 చేరుకుంది. ఇక కొత్తగా 9 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 1217కు చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతం ఉండగా, అదే దేశంలో 1.5 శాతం ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 87.01 శాతం ఉండగా, దేశంలో 85.7 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 26,104 ఉండగా, హోంఐసోలేషన్‌లో 21,551 ఉంది.

ఇక కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు .. జీహెచ్‌ఎంసీలో 291, కరీంనగర్‌ 100, మేడ్చల్‌ మల్కాజిగిరి 171, నల్గొండ 108, రంగారెడ్డి 138 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి.

Next Story