ఏపీలో కొత్త‌గా 5,487 కేసులు.. 37 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2020 2:06 PM GMT
ఏపీలో కొత్త‌గా 5,487 కేసులు.. 37 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 66,121 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,487 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,81,161కి చేరింది.

కొవిడ్‌ వల్ల ప్రకాశంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కృష్ణ‌లో ఐదుగురు, తూర్పుగోదావ‌రిలో న‌లుగురు, గుంటూరులో న‌లుగురు, క‌డ‌ప‌లో ముగ్గురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఇద్ద‌రు, నెల్లూరులో ఒక్క‌రు చొప్పున 37 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,745కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,12,300 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 63,116 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 310,

చిత్తూరులో 329,

ఈస్ట్‌ గోదావరిలో 1010,

గుంటూరులో 538,

కడపలో 271,

కృష్ణలో 97,

కర్నూలులో 113,

నెల్లూరులో 489,

ప్రకాశంలో 634,

శ్రీకాకుంలో 286,

విశాఖపట్నంలో 145,

విజయనగరంలో 362,

పశ్చిమ గోదావరి 903 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story