ఏపీలో కొత్త‌గా 3,620 కేసులు.. 16 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2020 12:48 PM GMT
ఏపీలో కొత్త‌గా 3,620 కేసులు.. 16 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 76,726 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,620 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,96,919కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో న‌లుగురు, చిత్తూరులో ఇద్ద‌రు, తూర్పు గోదావ‌రిలో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఇద్ద‌రు, అనంత‌పూర్‌లో ఒక్క‌రు, క‌డ‌ప‌లో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు, ప‌శ్చిమ ‌‌గోదావరిలో ఒక్క‌రు చొప్పున 16 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 6,524కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7,58,138 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 32,257 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 196,

చిత్తూరులో 412,

ఈస్ట్‌ గోదావరిలో 492,

గుంటూరులో 385,

కడపలో 212,

కృష్ణలో 370,

కర్నూలులో 66,

నెల్లూరులో 126,

ప్రకాశంలో 311,

శ్రీకాకుళంలో 126,

విశాఖపట్నంలో 171,

విజయనగరంలో 122,

పశ్చిమ గోదావరి 631 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story