ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Oct 2020 5:46 PM IST![ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/10/2901-Corona-Cases-In-AP.jpg)
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 84,401 శాంపిల్స్ను పరీక్షించగా.. 2,886 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,565కి చేరింది.
కొవిడ్ వల్ల కృష్ణలో ముగ్గురు, అనంతపూర్లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, గుంటూర్లో ఇద్దరు, కడపలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున 17 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,676కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7,88,375 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 25,514 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read
తెలంగాణలో 1,531 కరోనా కేసులుNext Story