ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 11:51 AM GMT
ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 75,465 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,477 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,33,208కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఇద్ద‌‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఇద్ద‌రు, అనంత‌పూ‌ర్‌లో ఒక్క‌రు, చిత్తూరులో ఒక్క‌రు, తూర్పుగోదావ‌రిలో ఒక్క‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఒక్క‌రు చొప్పున 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,744కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8,05,026 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 21,438 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.



Next Story