తెలంగాణలో కొత్తగా 1,896 కేసులు.. 8 మరణాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Aug 2020 3:26 AM GMTతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగస్టు 10న సోమవారం) 18,035 శాంపిల్స్ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 82,647కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 645 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,788మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 59,374కి చేరింది. 22,628 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 14
భద్రాద్రి కొత్తగూడెం- 60
జీహెచ్ఎంసీ -338
జగిత్యాల-59
జనగాం- 71
జయశంకర్ భూపాలపల్లి – 20
జోగులాంబ గద్వాల – 85
కామారెడ్డి -71
కరీంనగర్ -121
ఖమ్మం -65
ఆసిఫాబాద్ – 17
మహబూబ్ నగర్ -58
మహబూబాబాద్ -23
మంచిర్యాల- 11
మెదక్ – 14
మేడ్చల్ మల్కాజ్గిరి – 119
ములుగు –23
నాగర్కర్నూల్ – 7
నల్లగొండ – 54
నారాయణపేట -13
నిర్మల్ -12
నిజామాబాద్ – 42
పెద్దపల్లి – 66
రాజన్న సిరిసిల్ల -38
రంగారెడ్డి -147
సంగారెడ్డి -49
సిద్దిపేట – 64
సూర్యాపేట-32
వికారాబాద్-21
వనపర్తి –28
వరంగల్ రూరల్ –35
వరంగల్ అర్భన్ -95
యాదాద్రి భువనగిరి -24 కేసులు నమోదు అయ్యాయి.