ఏపీలో కొత్తగా 7,665 కేసులు.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 1:40 PM GMT
ఏపీలో కొత్తగా 7,665 కేసులు.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 46,999 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,665 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,35,525కి చేరింది.

కొవిడ్‌ వల్ల ప్రకాశంలో పదకొండు మంది, గుంటూరులో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్‌లో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు చొప్పున మొత్తం 80 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2116 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,45,636 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 87,773 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 631,

చిత్తూరులో 479,

ఈస్ట్‌ గోదావరిలో 1235,

గుంటూరులో 621,

కడపలో 439,

కృష్ణలో 146,

కర్నూలులో 883,

నెల్లూరులో 511,

ప్రకాశంలో 450,

శ్రీకాకుంలో 354,

విశాఖపట్నంలో 620,

విజయనగరంలో 574,

పశ్చిమ గోదావరిలో 722 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story