తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 1831 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 4:17 PM GMT
తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 1831 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6383 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1831 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ప‌ద‌కొండు మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 25733 కేసులు నమోదు కాగా, 306 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 1419 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 160 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 117 కేసులు, మెద‌క్‌ జిల్లాలో 20 కేసులు, మంచిర్యాల‌‌‌ జిల్లాలో 20 కేసులు, ఖ‌మ్మం జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. గ‌త ప‌దిహేను రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14781 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 10646 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 2078 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌



Next Story