తెలంగాణ‌లో 50వేలు దాటిన క‌రోనా కేసులు

By Medi Samrat  Published on  23 July 2020 4:03 PM GMT
తెలంగాణ‌లో 50వేలు దాటిన క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13367 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1,567 కేసులు పాజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 50826 కేసులు నమోదు కాగా, 447 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 662 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 33 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 32 కేసులు, ఖ‌మ్మం జిల్లాలో 10 కేసులు, కామారెడ్డి జిల్లాలో 17 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌‌ జిల్లాలో 77 కేసులు, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 38 కేసులు, జ‌గిత్యాల‌‌‌ జిల్లాలో 14 కేసులు, మ‌హ‌బూబ‌బాద్ జిల్లాలో 18 కేసులు, మెద‌క్ జిల్లాలో 27 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో 61 కేసులు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో 25 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 44 కేసులు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 62 కేసులు, అదిలాబాద్ జిల్లాలో 17 కేసులు, నాగ‌ర్ క‌ర్నూల్‌ జిల్లాలో 51 కేసులు, జ‌న‌గాం జిల్లాలో 22 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 38 కేసులు, ములుగు జిల్లాలో 17 కేసులు, సూర్యాపేట జిల్లాలో 39 కేసులు చొప్పున‌ నమోదయ్యాయి. గ‌త నెల‌న్న‌ర‌‌ రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 39,327 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 11,052 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1661 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.



Next Story