ఏపీలో 70వేలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 7998 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 12:43 PM GMT
ఏపీలో 70వేలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 7998 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లోకరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 58052 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7998 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 72711కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో పద్నాలుగు మంది, గుంటూరులో ఏడుగురు, కర్నూల్‌లో ఏడుగురు, కృష్ణలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు చొప్పున మొత్తం 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 884 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 37,555 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 34,272మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1016,

చిత్తూరులో 271,

ఈస్ట్‌ గోదావరిలో 1391,

గుంటూరులో 1184,

కడపలో 224,

కృష్ణలో 230,

కర్నూలులో 904,

నెల్లూరులో 438,

ప్రకాశంలో 271,

శ్రీకాకుంలో 360,

విశాఖపట్నంలో 684,

విజయనగరంలో 277,

పశ్చిమ గోదావరిలో 748 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story