తెలంగాణ‌లో త‌గ్గ‌ని కరోనా‌ ఉధృతి.. కొత్త‌గా 1550 కేసులు

By Medi Samrat  Published on  13 July 2020 4:40 PM GMT
తెలంగాణ‌లో త‌గ్గ‌ని కరోనా‌ ఉధృతి.. కొత్త‌గా 1550 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11525 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1550 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 36221 కేసులు నమోదు కాగా, 365 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 926 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 212 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 53 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 19 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌‌ జిల్లాలో 16 కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 86 కేసులు, మెద‌క్‌‌ జిల్లాలో 6 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, మ‌హ‌బూబ‌బాద్ జిల్లాల‌లో త‌లా 13 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 41 కేసులు , కామారెడ్డి జిల్లాలో 33 కేసులు ఖ‌మ్మం జిల్లాలో 38 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 08 కేసులు, జ‌న‌గాం, సిద్దిపేట‌, సూర్యాపేట జిల్లాల్లో త‌లా 10కేసులు చొప్పున‌ నమోదయ్యాయి. గ‌త నెల‌ రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23679 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 12178 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1197 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌



Next Story