ఏపీలో క‌రోనా విలయతాండవం.. కొత్త‌గా 1935 కేసులు.. 37 మ‌ర‌ణాలు

By Medi Samrat  Published on  13 July 2020 11:52 AM GMT
ఏపీలో క‌రోనా విలయతాండవం.. కొత్త‌గా 1935 కేసులు.. 37 మ‌ర‌ణాలు

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,247 సాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 1,935 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1919 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 13 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 31103కి చేరింది.



కొవిడ్‌ వల్ల అనంత‌పురంలో ఆరుగురు, క‌ర్నూలు, ప‌శ్చిమ‌ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి జిల్లాలలో నలుగురు, కృష్ణ, చిత్తూరు, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌లో ముగ్గురు.. క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల‌లో ఇద్ద‌రు.. శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌లో ఒక‌రు చొప్పున‌ మొత్తం 37 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 365కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 16464 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 14274 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 1030 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిచ్చార్జ్ చేయ‌బ‌డ్డారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా…

అనంతపురంలో 176,

చిత్తూరులో 168,

ఈస్ట్‌ గోదావరిలో 313,

గుంటూరులో 191,

కడపలో 84,

కృష్ణలో 11,

కర్నూలులో 249,

నెల్లూరులో 99,

ప్రకాశంలో 34,

శ్రీకాకుంలో 204,

విశాఖపట్నంలో 84,

విజయనగరంలో 69,

పశ్చిమ గోదావరిలో 137 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story