ఏపీలో కొత్త‌గా 10,601 కేసులు.. 73 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 2:06 PM GMT
ఏపీలో కొత్త‌గా 10,601 కేసులు.. 73 మ‌ర‌ణాలు

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 70,993 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,601 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,17,094కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో ప‌ది మంది, అనంత‌పూర్‌లో ఎనిమిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, క‌డ‌ప‌లో ఏడుగురు, ప్ర‌కాశంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖ‌‌ప‌ట్నంలో ఆరుగురు, తూర్పుగోదావ‌రిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, క‌ర్నూల్‌లో ఇద్ద‌రు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4560కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,15,765 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 96,769 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 441,

చిత్తూరులో 1178,

ఈస్ట్‌ గోదావరిలో 1426,

గుంటూరులో 702,

కడపలో 801,

కృష్ణలో 389,

కర్నూలులో 514,

నెల్లూరులో 1042,

ప్రకాశంలో 1457,

శ్రీకాకుంలో 505,

విశాఖపట్నంలో 426,

విజయనగరంలో 598,

పశ్చిమ గోదావరి 1122 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story