ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 6:48 PM ISTఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 62,024 శాంపిల్స్ను పరీక్షించగా.. 10,548 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,14,164కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో పదిహేను మంది, నెల్లూరులో పదకొండు మంది, తూర్పుగోదావరిలో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, అనంతపూర్లో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, కర్నూల్లో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు చొప్పున మొత్తం 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,796 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,12,687 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 97,681 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 864,
చిత్తూరులో 813,
ఈస్ట్ గోదావరిలో 1096,
గుంటూరులో 635,
కడపలో 991,
కృష్ణలో 362,
కర్నూలులో 791,
నెల్లూరులో 1038,
ప్రకాశంలో 870,
శ్రీకాకుంలో 522,
విశాఖపట్నంలో 988,
విజయనగరంలో 715,
పశ్చిమ గోదావరిలో 863 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.