ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 84 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 2:07 PM GMT
ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 84 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 59,834 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,368 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,45,139కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో ప‌ద్నాలుగు మంది, అనంతపూర్‌లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ప‌ద‌కొండు, తూర్పుగోదావరిలో ప‌దిమంది, గుంటూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, క‌డ‌ప‌లో ఐదుగురు, కృష్ణ‌లో న‌లుగురు, క‌ర్నూలులో న‌లుగురు, శ్రీకాకుళంలో న‌లుగురు, ప్ర‌కాశంలో ముగ్గురు, విజ‌య‌న‌గ‌రంలో ఇద్ద‌రు చొప్పున‌ మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,053 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,39,876 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 1,01,210 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 456,

చిత్తూరులో 1068,

ఈస్ట్‌ గోదావరిలో 1208,

గుంటూరులో 617,

కడపలో 994,

కృష్ణలో 311,

కర్నూలులో 813,

నెల్లూరులో 1059,

ప్రకాశంలో 888,

శ్రీకాకుంలో 629,

విశాఖపట్నంలో 825,

విజయనగరంలో 552,

పశ్చిమ గోదావరి 948 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story