ఏపీలో కొత్తగా 10,175 కేసులు.. 68 మరణాలు
By తోట వంశీ కుమార్ Published on 10 Sept 2020 5:53 PM ISTఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 72,229 శాంపిల్స్ను పరీక్షించగా.. 10,175 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,37,687కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో తొమ్మిది మంది, కడపలో తొమ్మిది మంది, నెల్లూరులో తొమ్మిది మంది, కృష్ణలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, అనంతపూర్లో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, గుంటూరులో ఇద్దరు మరియు విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 68 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,702కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,35,647 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 97,338 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 422,
చిత్తూరులో 968,
ఈస్ట్ గోదావరిలో 1412,
గుంటూరులో 838,
కడపలో 576,
కృష్ణలో 545,
కర్నూలులో 482,
నెల్లూరులో 823,
ప్రకాశంలో 1386,
శ్రీకాకుంలో 664,
విశాఖపట్నంలో 404,
విజయనగరంలో 516,
పశ్చిమ గోదావరి 10175 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.