మూడు రాజధానుల పై కేంద్రం మరోసారి క్లారిటీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Sep 2020 7:19 AM GMT
మూడు రాజధానుల పై కేంద్రం మరోసారి క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అపిడవిట్‌లో కేంద్రం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం స్పష్టం చేసింది.

విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. సెక్షన్‌ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని పేర్కొంది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని, హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ వెల్లడించింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది.

Next Story