ఏపీలో కొత్త‌గా 10,128 కేసులు.. 77 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2020 2:57 PM GMT
ఏపీలో కొత్త‌గా 10,128 కేసులు.. 77 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 7వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 60,576 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,128 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య1,84,461కి చేరింది.



కొవిడ్‌ వల్ల గుంటూరులో 16 మంది, విశాఖ‌ప‌ట్నంలో 12 మంది, శ్రీకాకుళంలో ప‌ది మంది, చిత్తూరులో ఎనిమిదిమంది, తూర్పుగోదావ‌రిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో న‌లుగురు, క‌ర్నూలులో ముగ్గురు, విజ‌య‌న‌గ‌రంలో ముగ్గురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, క‌డ‌ప‌లో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఇద్ద‌రు చొప్పున మొత్తం 77 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1681కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,04,354 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 80,424 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1260,

చిత్తూరులో 677,

ఈస్ట్‌ గోదావరిలో 1544,

గుంటూరులో 730,

కడపలో 729,

కృష్ణలో 440,

కర్నూలులో 1368,

నెల్లూరులో 537,

ప్రకాశంలో 349,

శ్రీకాకుంలో 405,

విశాఖపట్నంలో 842,

విజయనగరంలో 665,

పశ్చిమ గోదావరిలో 582 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story