ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి
ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎం వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు,మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/sSc9wnjq7U
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 23, 2025
తెలంగాణ రాష్ట్రంలో నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated:23-06-2025 @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/UZ99Zn0kYw
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) June 23, 2025
ఇదిలా ఉంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదేశానుసారం అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో విపత్తు నిర్వహణ సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటనలో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు.