కేరళలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇంతలో పాలా పట్టణంలో నీటితో నిండిన వీధి గుండా సగం మునిగిపోయిన మహీంద్రా థార్ కారు వస్తున్న వీడియో వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్ యూజర్ అబిన్ సెబాస్టియన్ షేర్ చేసిన ఈ వీడియోలో.. రుతుపవనాల వర్షం కారణంగా అనేక ప్రాంతాలు జలమయం కావడంతో SUV వరద నీటిలో రోడ్డుపై కదులుతున్నట్లు చూడవచ్చు. ఎంతో మంది వీడియో కింద తాము ఆ కారు మునిగిపోతుందని భావించామని, కానీ ఊహించని విధంగా అది బయటకు వచ్చిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు తీవ్రమయ్యాయి, కేరళ అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. శుక్రవారం నాడు తిరువనంతపురంలోని వాతావరణ కేంద్రం ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్లను జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలలో శనివారం ఉదయం వరకు వర్షం కురుస్తూనే ఉంది.