ఏపీ కరోనా బులిటెన్.. స్వల్పంగా పెరిగిన కేసులు, మరణాలు
320 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,768 పరీక్షలు
By Medi Samrat Published on
7 Nov 2021 1:09 PM GMT

ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,768 పరీక్షలు నిర్వహించగా.. 320 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,241కి చేరింది. నిన్న కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,397కి చేరింది. 24 గంటల వ్యవధిలో 425 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,50,386కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,458 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,97,45,537 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story