ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
222 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,473 పరీక్షలు
By Medi Samrat Published on
18 Nov 2021 11:57 AM GMT

ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,473 పరీక్షలు నిర్వహించగా.. 222 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,738కి చేరింది. నిన్న కరోనా వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,423కి చేరింది. 24 గంటల వ్యవధిలో 275 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,53,755కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,560 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,00,97,888 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story