ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

178 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27,657

By Medi Samrat
Published on : 28 Nov 2021 6:15 PM IST

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27,657 పరీక్షలు నిర్వహించగా.. 178 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,624కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ఒక్క రోజే ఆరుగురు మృతిచెందారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,438గా ఉంది. 24 గంటల వ్యవధిలో 190 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,56,046కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,140 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,03,72,427 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story