ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
121 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా
By Medi Samrat Published on 19 Dec 2021 11:56 AM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,643 పరీక్షలు నిర్వహించగా.. 121 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,804కి చేరింది. కరోనా వల్ల నిన్న ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,479గా ఉంది. 24 గంటల వ్యవధిలో 228 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,59,728కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,597 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,09,90,296 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 19/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 19, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,72,909 పాజిటివ్ కేసు లకు గాను
*20,56,833 మంది డిశ్చార్జ్ కాగా
*14,479 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,597#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/YoAC5Hzspd