ఏపీ, తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవుల పండుగ

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు పబ్లిక్ హాలిడే ప్రకటించారు

By -  Knakam Karthik
Published on : 26 March 2026 6:51 AM IST

Telugu News, Andrapradesh, Telangana, SriRamaNavami, Bank Holiday, Public Holiday

ఏపీ, తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవుల పండుగ

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవు వర్తిస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే, రేపు శ్రీరామనవమి సెలవుతో పాటు, ఆ మరుసటి రోజు (మార్చి 28) నాలుగో శనివారం, ఆపై మార్చి 29 ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

వరుస సెలవుల కారణంగా చెక్కుల క్లియరెన్స్, డిపాజిట్లు వంటి అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ఈరోజే (గురువారం) పూర్తి చేసుకోవడం ఉత్తమం. బ్యాంక్ శాఖలు అందుబాటులో లేకపోయినప్పటికీ, యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే, వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి అవసరమైన వారు ముందస్తుగా నగదును సిద్ధం చేసుకోవడం మంచిది. మార్చి 30 (సోమవారం) నుండి తిరిగి అన్ని కార్యాలయాలు, బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

Next Story