తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
By Knakam Karthik
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలోనూ ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్లో పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 ఓటర్లు ఉండగా 56 అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కోసం 27,088 మంది ఉపాధ్యాయులు ఓట్లు నమోదు చేసుకోగా 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆ నాలుగు జిల్లాల పరిధిలో అధికారులు 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
వరంగల్-నల్లగొండ-ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి 25,797 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల పోలింగ్ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లను పరిశీలించారు.