ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు చేసి, త్వరలోనే వేతన సంఘం ఛైర్మన్ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి.
అలాగే ప్రధానంగా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో మూడో లాంఛ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతరిక్షంలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.