TTD to issue offline free darshan tickets from tomorrow. తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి కోటా స్లాటెడ్ సర్వ దర్శనం కోసం రేపటి నుండి
By Medi Samrat Published on 14 Feb 2022 6:02 AM GMT
తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి కోటా స్లాటెడ్ సర్వ దర్శనం కోసం రేపటి నుండి అంటే ఫిబ్రవరి 15 నుండి ఆఫ్లైన్ టిక్కెట్లను జారీ చేయనున్నాయి. కోవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు తగ్గుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోబడింది. రాష్ట్రంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ చెలరేగడంతో టీటీడీ ఆఫ్లైన్ టిక్కెట్ల జారీని నిలిపివేసింది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఉచిత దర్శనం కోసం ఆఫ్లైన్ టిక్కెట్లను తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అందువల్ల తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులు ఫిబ్రవరి 16న దర్శనం చేసుకోవడానికి రేపటి నుండి టిక్కెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 16న ఉచిత దర్శనం టిక్కెట్లను.. రేపు ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజ స్వామి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉచిత దర్శన టిక్కెట్లు ఇస్తారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 10 వేల ఉచిత దర్శన టిక్కెట్లు ఇవ్వనున్నారు. సామాన్య భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు టీటీడీ ఆఫ్లైన్లో ఉచిత దర్శనం కోసం టిక్కెట్లను ప్రారంభించింది.