తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది.
కొండపై ఆదిశేషు అతిథి గృహం దగ్గర ఓ చెట్టులో ఈ నాగుపాము కనిపించింది. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని నాగుపామును జాగ్రత్తగా పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.