భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By -  Medi Samrat
Published on : 21 Oct 2025 8:30 PM IST

భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు సహకరించాలని తిరుపతి వర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే గోవులు అకాల మరణం చెందాయని విమర్శించారు. వాటికి సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

Next Story